పహాడీషరీఫ్:మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరుతూ 18,19 వార్డుల కౌన్సిలర్లు కెంచె లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. మంగళవారం వారు మంత్రిని కలిసి కాలనీలలో డ్రైనేజీ, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. ఇటీవల 17,18,19 వార్డులలో డ్రైనేజీ, సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు రూ. కోటి 39 లక్షల నిధులను మంత్రి విడుదల చేయడంతో కొన్ని పనులు పూర్తి కావస్తున్నాయన్నారు. మరిన్ని అభివృద్ధి పనులకు అధిక నిధులు కేటాయించాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారని కౌన్సిలర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుడు వాసుబాబు పాల్గొన్నారు.