అమీర్పేట్ : హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నగరంలో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. అందులో భాగంగా అమీర్పేట్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రహరీగోడకు ఆనుకుని ఉన్న ఫుట్పాత్ ఆక్రమణలను జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం ఉదయం తొలగించారు.
టీ బండి, పాన్షాపు, మెకానిక్ షాపుతో పాటు ఫ్రూట్జ్యూస్ బండిని తొలగించారు. ఈ ఆక్రమణల తొలగింపు చర్యల్లో ఖైరతాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ, టౌన్ ప్లానింగ్ ఏసీపీ రమేష్తో పాటు సెక్షన్ అధికరాలు, సిబ్బంది పాల్గొన్నారు.