చిక్కడపల్లి : పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందని, వారికే పార్టీ కమిటీల్లో సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కమిటీ విస్తృతస్థాయి సమావేశం బుధవారం డివిజన్లోని టీఆర్టీ గ్రౌండ్స్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడానికి కమిటీలు నియమిస్తామని తెలిపారు.
బస్తీ కమిటీల నియమాకల్లో అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. బస్తీ కమిటీలో 11 మందికి అవకాశం కల్పిస్తామన్నారు. ఈ కమిటీల్లో 52 శాతం బీసీ ఎస్సీ,ఎస్టీ మహిళా, మైనార్టీలకు ఆవకాశం కల్పిస్తామన్నారు. పార్టీ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ, ముఠా నరేశ్, యువ నాయకుడు ముఠా జైసింహ, డివిజన్ కమిటీ పరిశీలకులు బల్వీర్ సింగ్,మల్లికార్జున్ రెడ్డి, కో-ఆర్డినేటర్లు జి.పరుశురామ్ ముదిరాజ్, ఎం.వి అశోక్, పాశం రవి, మాజీ కార్పొరేటర్ ఎం.పద్మ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.