సీఎం కేసీఆర్ గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో గిరిజనులకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచడాన్ని హర్షిస్తూ శనివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సంబురాలు హోరెత్తాయి. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పలు ప్రాంతాల్లో గిరిజన సంఘాల నాయకులు, మహిళలు క్షీరాభిషేకాలు నిర్వ హిం చారు. జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి జీవో నంబర్ 33ను జారీ చేసింది. శనివారం నుంచి కొత్త రిజర్వేషన్లు అమల్లోకి రావడంతో గిరిజన సంఘాల నాయకులు సంబు రాలు చేసుకున్నారు. స్వీట్లు పంచి పటాకులు కాల్చా రు.
-న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ, అక్టోబర్1
నందిగామ, అక్టోబర్ 1: తెలంగాణ ప్రభుత్వం ఎస్టీల రిజర్వేషన్ను ఆరు నుంచి పది శాతానికి పెంచడాన్ని హర్షిస్తూ శనివారం చాకలిగుట్టతండాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, స్థానిక గిరిజన నాయకులు, మహిళలతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలోనే గిరిజనులకు గుర్తింపు వచ్చిందని, తండాలను గ్రామపంచాయతీలుగా చేయడం, రిజర్వేషన్ శాతాన్ని పదికి పెంచడం వంటి అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని కొనియాడారు. దీంతో యావత్ గిరిజనులు సీఎం కేసీఆర్కు అండగా ఉంటారన్నారు.
తాండూరు, అక్టోబర్ 1: సీఎం కేసీఆర్ గిరిజనుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తాం డూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్ అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద గిరిజనుల రిజర్వేషన్ శాతాన్ని పెంచడాన్ని హర్షిస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి గిరిజన సంఘాల నాయకులు, టీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ రిజర్వేషన్ను ఆరు నుంచి పది శాతానికి పెంచిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప మాట్లాడుతూ రిజర్వేషన్ను పది శాతానికి పెం చడం ద్వారా గిరిజన విద్యార్థులకు విద్య, ఉద్యోగాల్లో మరింత మేలు జరుగుతుందన్నారు. గిరిజనబంధును కూడా అమలు చేస్తే వారి జీవితా ల్లో వెలుగులు నిండుతాయన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు, గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
గిరిజనుల రిజర్వేషన్ను పది శాతానికి పెంచిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభినందనలు. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు గిరిజనుల అభ్యున్నతిని ఎప్పుడూ పట్టించుకోలేదు. రిజర్వేషన్ల శాతం పెరుగడంతో గిరిజన విద్యార్థులు, నిరుద్యోగులకు విద్యాఉద్యోగ రంగాల్లో ఎంతో మేలు జరుగుతుంది.
-రాఘవన్నాయక్, అఖిల భారత గిరిజన సమాఖ్య ఏఐటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు , వికారాబాద్
సీఎం కేసీఆర్ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేసిం ది. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు ఎప్పుడూ గిరిజనుల సంక్షేమానికి కృషి చేయలేదు. ఎస్టీల రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ గిరిజనుల రిజర్వేషన్ శాతాన్ని పదిశాతానికి పెం చుతూ జీవో జారీ చేయడం సంతోషకరం. దీంతో గిరిజనులం తా తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారు.
-బీమ్లానాయక్, మద్దూర్,
తెలంగాణలో జనాభా దామాషా ప్రకారం గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్ను కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం హర్షణీయం. ఇప్పటికే గిరిజనుల అభివృద్ధికి గిరిజనబంధు పథకాన్ని కూడా రాష్ట్రంలో అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రక టించడం సంతోషకరం. దీంతో గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.
-గోపాల్నాయక్, మద్దూర్తండా, షాబాద్
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి గిరిజనుల రిజర్వేషన్ను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ జీవోను జారీ చేయడం సంతోషంగా ఉంది. రిజర్వేషన్ల పెంపులో కీలక పాత్ర పోషించిన మంత్రి సత్యవతిరాథోడ్కు ప్రత్యేక ధన్యవాదాలు. -రవికుమార్,
తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి