నందిగామ, ఆగస్టు 9 : మండల కేంద్రంలో మంగళవారం పీర్ల పండుగను నిర్వహించారు. ముస్లిం పెద్దలు పీర్లను అలంకరించి ప్రార్థనలు చేసి పీర్లను ఊరేగింపుగా దర్గాల వద్దకు వెళ్లి మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్రెడ్డి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్, ఆగష్టు 9 : నియోజకవర్గంలో మొహర్రం పండుగను మంగళవారం త్యాగానికి ప్రతీక అయిన హజరత్ ఇమామ్హుసేన్ల పీర్లను మండల పరిధిలోని రాయపోల్, దండుమైలారం, ముకునూరు, నెర్రపల్లి, పోల్కంపల్లి, నాగన్పల్లి, కప్పాడు, తుర్కగూడ, చర్లపటేల్గూడ, ఉప్పరిగూడ, పోచారం, ఎలిమినేడు, తులేకలాన్తో పాటు పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున ఊరేగించి దట్టి కట్టి ప్రార్థనలు చేశారు.
తలకొండపల్లి, ఆగస్టు 9 : మండల కేంద్రంతో పాటు వెలిజాల్, గట్టుఇప్పలపల్లి, చుక్కాపూర్, పడకల్, చంద్రధన తదితర గ్రామాల్లో మొహర్రం నిర్వహించారు. పీర్ల చావిడిల వద్ద మొక్కులు తీర్చుకొని దట్టిలు సమర్పించారు. అంతకుముందు ముస్లింలు ఈద్గాల వద్ద ప్రార్థనలు చేశారు.
మొయినాబాద్, ఆగస్టు 9 : మండలల పరిధిలోని సురంగల్, హిమాయత్నగర్, కేతిరెడ్డిపల్లి, చిన్నమంగళారం, మొయినాబాద్, ముర్తుజాగూడ, కుతుబుద్దీన్గూడ, చందానగర్, చిలుకూరు, ఎల్కగూడ, వెంకటాపూర్, తోలుకట్టా, నక్కలపల్లి గ్రామాల్లో పీర్లను ఊరేగించారు.
కడ్తాల్, ఆగస్టు 9 : మండలంలోని మక్తమాదారం, ముద్విన్, న్యామతాపూర్, రావిచేడ్, ఏక్వాయిపల్లి, చరికొండ, సాలార్పూర్ గ్రామాల్లో మొహర్రం పండుగను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్లు సులోచనసాయిలు, భారతమ్మనర్సింహాగౌడ్, యాదయ్య, భారతమ్మవిఠలయ్య, రవీందర్రెడ్డి, విజయలక్ష్మీశంకర్, ఎంపీటీసీలు గోపాల్, ప్రియరమేశ్, యాట నర్సింహ, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్, ఆగస్టు 9 : చేవెళ్ల మండల పరిధిలోని అంతారం, కౌకుంట్ల తదితర మంగళవారం గ్రామాల్లో మొహర్రం పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై పీర్ల ఊరేగింపును ఆసక్తిగా తిలకించారు.
యాచారం, ఆగస్టు9 : మండలంలోని కుర్మిద్ద, గున్గల్, మొండిగౌరెల్లి, చింతపట్ల, మాల్, పిల్లిపల్లి, నందివనపర్తి, చౌదర్పల్లి తదితర గ్రామాలలో మొహర్రం పండుగను వైభవంగా జరుపుకొన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు పీర్లను దర్శించుకున్నారు. పీర్లను ఊరేగింపుగా తీసుకొని నిమజ్జనం చేశారు.
పెద్దఅంబర్పేట, ఆగస్టు 9: మున్సిపాలిటీతోపాటు అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో మొహర్రం పండుగను నిర్వహించారు. దివ్యాంగుల హక్కుల పోరాట సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు చెలిమండ్ల గోవర్ధన్ కుత్బుల్లాపూర్లో పీర్లకు దట్టి కట్టారు. ఆయన వెంట మాజీ ఎంపీటీసీ రాములు, టీఆర్ఎస్ నాయకులు సీహెచ్ యాదగిరి, దుర్గాప్రసాద్, గణేశ్, దేవిశ్రీప్రసాద్ ఉన్నారు.