బంజారాహిల్స్ : బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో మరింత నాణ్యమైన ఎక్స్రే సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఎఫ్డీఆర్ స్మార్ట్ ఎఫ్ పేరుతో అత్యాధునిక డిజిటల్ రేడియోగ్రఫీ ఏర్పాటు చేశామని ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు. శుక్రవారం బంజారాహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఆవరణలో అధునాతన రేడియోగ్రఫీ యంత్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ..తక్కువ సమయంలో ఎక్కువమందికి ఎక్స్రేలు తీసేందుకు ఈ యంత్రం ఉపయోగపడుతుందని. 8గంటల్లో 200కు పైగా ఎక్స్రేలు తీయవచ్చన్నారు. గతంలో కేవలం ఫిలిమ్ మీదనే ఎక్స్రేలు తీసేవారని,ఈ కొత్త యంత్రం ద్వారా డిజిటల్ రూపంలో కూడా ఎక్స్రే అందుబాటులో వస్తుండడంతో వెంటనే వైద్యులు పరిశీలించి చికిత్సను ప్రారంభించే వీలు కలుగుతుందన్నారు.
ఇందులో అతితక్కువ రేడియేషన్తో పాటు ఎన్నో ఫీచర్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఈవో డా.ఆర్వీ.ప్రభాకర్రావు, మెడికల్ డైరెక్టర్ డా.టీఎస్.రావు, రేడియాలజీ విభాగాధిపతి డా.వీరయ్యదరి తదితరులు పాల్గొన్నారు.