వెంగళరావునగర్ : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎస్సార్ నగర్ పోలీసులు దాడులు చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరితో పాటు మరో నలుగురు మహిళలను అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు కథనం మేరకు..అమీర్పేటలోని నేచర్ క్యూర్ దవాఖానా ఎదురుగా ఉన్న సురేష్ ఆర్కేడ్ లోని ఓ ఫ్లాట్లో, ఎల్లారెడ్డిగూడలోని అంబేద్కర్ నగర్లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు.
వ్యభిచార కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఉప నిర్వాహకురాలైన వెస్ట్ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన కె.రమణమ్మ, రాజమండ్రికి చెందిన చంద్ర కుమారీలను అరెస్టు చేశారు. వీరితో పాటు నలుగురు మహిళలను అదుపులోకి తీసుకు న్నారు. కాగా వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న ప్రధాన నిర్వాహకురాలైన సంధ్య రాణి అలియాస్ దుర్గా రాణి పరారీలో ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.