శేరిలింగంపల్లి : రొమ్ముక్యాన్సర్పై ప్రజల్లో అవగాహాన కల్పించేందుకు పింక్ క్యాన్వాస్ కార్యక్రమం ఎంతగానో దోహాదపడుతుందని ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు, హిరో దగ్గుపాటి రానా అన్నారు. ఆదివారం గచ్చిబౌలిలోని అన్కో కాన్సర్స్ కేర్ సెంటర్ హాస్పటల్లో రొమ్ము క్యాన్సర్ అవగాహానకు ఏర్పాటుచేసిన పింక్ క్యాన్వాస్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో రొమ్ము క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, ముఖ్యంగా మహిళలు అధిక శాతం దీని భారిన పడుతున్నారన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహాన కల్పించి వారిని చైతన్యపరిచేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పింక్ క్యాన్వాస్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో చైతన్యం కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు.
అన్కో డాట్ కాం సహా వ్యవస్ధాపకుడు డాక్టర్ అమిత్ జోత్వానీ మాట్లాడుతూ అక్టోబర్ నెల రొమ్ము క్యాన్సర్ అవగాహాన మాసంగా జరుపుకోవడం జరుగుతుందని ఇందులో బాగంగా మహిళలకు దీనిపై మరింత అవగాహాన కల్పించేందుకు పింక్ క్యాన్వస్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ అంకాలజిస్టు డాక్టర్ శిఖర్ కుమార్, డాక్టర్ గీతా నాగశ్రీ, డాక్టర్ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.