ఉస్మానియా యూనివర్సిటీ: అన్ని విద్యార్థి సంఘాల ప్రతినిధులతో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ భేటీ కానున్నారు. ఈ నెల 9న మధ్యాహ్నం మూడు గంటలకు ఓయూ పరిపాలనా భవనంలోని సెనేట్ హాల్లో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు ఓయూ స్టూడెంట్ ఎఫైర్స్ డీన్ ప్రొఫెసర్ రాజేందర్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యాపరమైన అంశాలను సమావేశంలో చర్చిస్తారని చెప్పారు. ప్రతి విద్యార్థి సంఘం నుంచి కేవలం ఒకరిని మాత్రమే అనుమతిస్తామన్నారు.