బంజారాహిల్స్ : పేద ప్రజలు ఆనందంగా ఉంటే ప్రతిపక్ష పార్టీలు భరించలేకపోతున్నాయని, అందుకే సంక్షేమ పథకాలపై ఎప్పుడూ కుట్రలు చేస్తుంటాయని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల చికిత్స కోసం సీఎం రిలీఫ్ఫండ్ కింద మంజూరయిన చెక్కులతో పాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను గురువారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎర్రగడ్డ డివిజన్కు చెందిన లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ..గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అంటే కేవలం కంటి తుడుపుగా చేపట్టేవారని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలు సంపూర్ణంగా అమలవుతున్నాయన్నారు. ఏ పథకం రూపొందించినా పేదలను దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి చొరవతో వారంతా సంతోషంగా ఉన్నారన్నారు.
దీన్ని చూస్తున్న ప్రతిపక్ష పార్టీల కళ్లు మండుతున్నాయని, ఏదో ఒకసాకుతో పథకాలు ఆపేసి పేదల నోట్లో మట్టికొట్టాలని చూడడం ప్రతిపక్ష పార్టీలకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని మాయమాటలు చెప్పినా టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పేదల కోసమే పనిచేస్తుందనే విషయాన్ని ప్రజలందరూ నమ్ముతున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో ఎర్రగడ్డ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సంజీవ, సీనియర్ నాయకురాలు పల్లవి యాదవ్, మహ్మద్ అజీమ్, ముస్తాక్, రఘువీర్, పర్వీనా, నర్సింగ్, సంతోష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.