ఖైరతాబాద్ జోన్ బృందం: జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఫిలింనగర్ 18 బస్తీల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను ఎమ్మెల్యే దానం నాగేందర్ సందర్శించారు. గౌతమ్నగర్లోని శ్రీ సిద్ది వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో పూజలు చేశారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు మహేష్, సైదులు. శివ. మహేందర్, హనుమమ్మ, భీమమ్మ, లలిత తదితరులు పాల్గొన్నారు.
కాగా బస్తీల్లోని ఇరుకైన వీధుల్లో ఏర్పాటు చేసిన గణపతి మండపాల సందర్శనకు ఎమ్మెల్యే దానం నాగేందర్ స్కూటర్పై వెళ్లడం ఆకర్షణగా నిలిచింది. గల్లీల్లో జనంతో మాట్లాడుతూ వినాయక మండపాలను ఆయన సందర్శించారు.