బడంగ్పేట : మహేశ్వరం నియోజక వర్గంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. నిరవధికంగా కురుస్తున్న వర్షాల కారణంగా అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరు కూడ ఇండ్ల నుంచి భయటకు రావద్దు అన్నారు. పురాతన భవనాలలో, శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఎవరు కూడ ఉండకూడదన్నారు.
వరద ముంపుప్రాంతాల అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరం అయితే పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కలెక్టర్తో పాటు కమిషనర్లు, తాసీల్ధార్స్, మేయర్స్, చైర్మన్లు, కార్పొ రేటర్స్, కౌన్సిలర్స్, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.
చెరువుల వద్ద పరిస్థితిని గమనిస్తుండాలన్నారు. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొవడానికి అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. 24 గంటల మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, డిజాస్టర్ మెనేజిమెంట్ సిబ్బంది అందుభాటులో ఉన్నారని తెలిపారు. ఎవరికైనా ఇబ్బంది అయితే కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయాలన్నారు.
కంట్రోల్ రూమ్ నెంబర్స్ రంగారెడ్డి జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్ 040 23230817, మీర్పేట కంట్రోల్ రూమ్ నెంబర్ 9849171748, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కంట్రోల్ రూమ్ నెంబర్ 9000284313, జల్పల్లి మున్సిపాలిటీ నెంబర్ 8309693118, తుక్కుగూడ మున్సిపాలిటీ టోల్ నెంబర్ 8125491026 నెంబర్లను సంప్రదించాలన్నారు.