కవాడిగూడ : వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు బుధవారం గణేష్ నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని భోలక్పూర్ డివిజన్లోని దామోదరం సంజీవయ్యనగర్ ఎస్బీఐ కాలనీలో భోలక్పూర్ టీఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎ. శంకర్ గౌడ్, ప్రావిస యూత్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులను తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపాల్ మాట్లాడుతూ ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. గణేష్ నవరాత్రోత్సవాలు ప్రజల్లో భక్తిబావనను పెంపొందిస్తాయని, ప్రతి ఒక్కరూ భక్తి బావనను అలవర్చుకోవాలని ఆయన అన్నారు. గణేష్ ఉత్సవాలను భక్తులు శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్. రంగనాథ్ గౌడ్, జి. వేణు గౌడ్, ఎ. సాయి ప్రణీత్, ఎ. సాయి ప్రదీప్, సీహెచ్. సాయి కిరణ్, సీహెచ్. వాసు, సాహిల్ రాజ్, అభినవ్ సాయి, ఓరిగంటి సదాశివ గౌడ్, సీతల్ గౌడ్, జ్యోతిర్ సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు