బంజారాహిల్స్ : దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా ఆరోరోజున పలు ఆలయాల్లో అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బంజారాహిల్స్ రోడ్ నెం 14 నందినగర్లోని శ్రీ హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంవద్ద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దానం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాములు , ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాందాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటస్వామితో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ డివిజన్ ఇందిరానగర్లోని శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో అమ్మవారు సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహా చండీ హోమం నిర్వహించడంతో పాటు అన్నదానం కార్యక్రమాన్ని కార్పొరేటర్ పి.విజయారెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మోహన్యాదవ్, శివగౌడ్, బాబాగౌడ్,శంకర్, సింహం, మల్లేష్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.