కొత్తకోట, మార్చి 16 : కొత్తకోట పట్టణం సమీపంలోని భీమా ఫేజ్-2 నుంచి శంకరసముద్రం రిజర్వాయర్కు మంగళవారం సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సూచన మేరకు యాసంగి సాగు నిమిత్తం రిజర్వాయర్కు నీటిని విడుదల చేశామన్నారు. నెర్విన్, కానాయపల్లి, కనిమెట్ట, రామానంతపురం, దంతనూరు గ్రామాల్లో సుమారు 2,300 ఎకరాలకు నీరందుతుందన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీను, మాజీ వైస్ ఎంపీపీ మల్లేష్, మాజీ సీడీసీ చైర్మన్ జగ న్, నాయకులు శ్రీను, శాంతిరాజ్, కృష్ణయ్యగౌడ్, వెంకటన్నగౌడ్, రైతులు ఉన్నారు.