బంజారాహిల్స్ : మిసెస్ ఇండియా తెలంగాణ, ఏపీ -2021 అందాల పోటీల్లో పాల్గొనే వారి కోసం మంగళవారం వర్చువల్ విధానంలో ఆడిషన్స్ నిర్వహించారు. విభిన్నమైన నేపథ్యాలు కలిగి ఉన్న పలువురు మహిళలు ఈ ఆడిషన్స్లో పొల్గొన్నారు. నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు సంబంధించిన గ్రాండ్ ఫినాలే పోటీలు నవంబర్లో నిర్వహిస్తామని పోటీల నిర్వాహకులు మమతా త్రివేది తెలిపారు.
రెండు తెలుగురాష్ట్రాలనుంచే కాకుండా యూఎస్ఏ, మలేషియా తదితర దేశాల్లోని తెలుగు మహిళలు కూడా ఆడిషన్స్లో పాల్గొంటున్నారని ఆమె పేర్కొన్నారు. పెళ్లయిన మహిళల్లో కూడా మరింత ఆత్మస్థెర్యాన్ని నింపడంతో పాటు తమలోని భావాలను పంచుకునేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు.