సికింద్రాబాద్ : నిరుపేదల కుటుంబానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అండగా నిలిచారు. అనారోగ్యంతో బాధపడు తున్న చిన్నారికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.59వేల ఎల్వోసీని అందజేశారు. గాజులరామారం వివేకానందనగర్ కాలనీకి చెందిన జి. నర్సింహ్మా కుమార్తె నక్షత్ర అనారోగ్యంతో నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నది.
నర్సింహ్మా వైద్య ఖర్చులు చెల్లించలేని పరిస్థితిలో ఉండగా ఈ విషయాన్ని టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లా రు. వెంటనే ఎమ్మెల్యే స్పందిస్తూ సీఎం సహాయనిధి నుంచి రూ.59వేల ఎల్వోసీని మంజూరు చేయించారు. మంజూరైన చెక్కును శుక్రవారం వారి కుటుంబసభ్యులకు కార్కానాలోని తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, నేతలు నివేదితా, సదానంద్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.