బండ్లగూడ :బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కోటి తొంభై ఐదు లక్షల రూపాయల వ్యయంతో చేయ తలపెట్టిన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. స్థానిక మేయర్ మహేందర్గౌడ్, డిప్యూటి మేయర్ పూలపల్లి రాజేందర్రెడ్డి, కమిషనర్ వేణుగోపాల్రెడ్డి స్థానిక కార్పొరేటర్లు,నాయకులతో కలిసి ఆయన పలు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్బంగా ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే అనేక అభివృద్ది పనులను చేపట్టడం జరిగిందన్నారు. అన్ని డివిజన్లలో సీసీ రోడ్లు,అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందని వివరించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని గ్రామాలు,కాలనీలు, బస్తీలలో కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ది పనులను చేపడుతున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆయా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, డీఈ శారద, ఏఈ రాజీవ్రెడ్డి, బండ్లగూడ జాగీర్ టీఆర్ఎస్ అద్యక్షుడు సురేష్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు రావులకోళ్ల నాగరాజు, పాపయ్య యాదవ్, సుమన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.