మైలార్దేవ్పల్లి : దసరా పండుగను నియోజకవర్గం ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో నెలకోల్పిన అమ్మవారి మండపాల ను ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. మండప నిర్వాహకులు ఎమ్మెల్యేకు శాలువాతో సత్కరించారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ మాట్లాడుతూ..దేవి నవరాత్రులు నిష్టతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నవారికి అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయిని అన్నారు. మధుబన్ కాలనీలలోని విజయకనకదుర్గా ఆలయంలో ఆలయ నిర్వహాకు లు మహా అన్నదాన కార్యాక్రమం నిర్వహించారు.
సుమారు మూడు వేల మంది భక్తులకు అన్నదానం నిర్వహించామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ కార్పొరేటర్ టి ప్రేమ్దాస్గౌడ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఆయనకు ఆలయ నిర్వాహకులు శాలువాతో సన్మానించారు.