బండ్లగూడ : శివారు మున్సిపాలిటీ ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు 1200 కోట్ల రూపాయల నిధులను సీఎం కేసీఆర్ విడుదల చేయడంపట్ల రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. దీనితో శివారు ప్రాంతాల మంచినీటి సమస్య తీరనుందని పేర్కొన్నారు.
ఈ మేరకు అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావును మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి పుష్పగుచ్చాన్ని అందించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ నిధుల విడుదలకు 674 జీఓను విడుదల చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.