చిక్కడపల్లి : నగరంలో ప్రసిద్ధి గాంచిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామి వారి నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రధ్దలతో కొనసాగుతున్నాయి. సోమవారం స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించా రు. బిల్లార్చన పూజా కార్యక్రమం కన్నుల పడువగా జరిగింది. దేవాలయం కార్యనిర్వాహణాధికారి దీప్తి పర్యవేక్షణలో పూజ కార్యక్రమాలు జరిగాయి. చిక్కడపల్లిలోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన వినాయకున్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పార్టీ యువ నాయకుడు ముఠా జైసింహ, ముచ్చకుర్తి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత :ఎమ్మెల్యే ముఠా గోపాల్
కవాడిగూడ: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావనను పెంపొందించుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు సోమవారం వినాయక వేడకల సందర్భంగా భోలక్పూర్ డివిజన్లోని దామోదరం సంజీవయ్యనగర్లో బస్తీవాసులు మజ్జిగ మల్లేష్యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ముందుగా గణనాథుడికి పూల మాలలు వేసి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినాయక ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. నిమజ్జన సమయంలో కోవిడ్ నిబంధనలను పాటించి జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. ముఖ్యంగా బస్తీవాసులు ముందకు వచ్చి దేవుని సన్నిదిలో అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు.
కవాడిగూడ భీమా మైదాన్లో…
వినాయక ఉత్సవాల సందర్భంగా సోమవారం కవాడిగూడ డివిజన్లోని భీమా మైదాన్లో కాలనీలో కేఎం సాయిరాం ఆధ్వర్యంలో వినాయకుడి మండపం వద్ద భక్తులను అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ గ్రేటర్ సీనియర్ నాయకుడు ఎమ్మెన్ శ్రీనివాస్ రావు హాజరై అన్నదానం చేశారు. ముందుకుగా గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగా శ్రీనివాస్, లక్ష్మణ్, వెంకటేశ్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.