ముషీరాబాద్ : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. ముషీరాబాద్ డివిజన్ బాపూజీనగర్లో ఓం శివగంగ భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కె.బాబురావు, సభ్యులు శంకర్, కృష్ణంరాజు, టీఆర్ఎస్ నాయకులు నర్సింగ్ ప్రసాద్లు పాల్గొన్నారు. రాంనగర్ ఎస్టీఆర్ క్వార్టర్స్లో టీఆర్ఎస్ నేత గోపి ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద అన్న దాన కార్యక్రమం జరిగింది. టీఆర్ఎస్ యూత్ నాయకుడు ముఠా జయసింహ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.