బన్సీలాల్పేట్ : మహ్మద్ ప్రవక్త జన్మదినం రోజున మిలాద్ ఉన్ నబీ పేరుతో ఆయన జన్మదినాన్ని ముస్లీమ్ సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడిపారిశ్రమ, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్పేట్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మిలాద్ ఉన్ నబీ వేడుకలను బన్సీలాల్పేట్లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, పేదలకు అన్నదానం చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తలసాని ముస్లీమ్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో హిందూ-ముస్లీమ్ ల మధ్య సోదరభావం పెంచేలా, అన్ని మతాల సాంప్రదాయాలను సమానంగా గౌరవించేలా పర్వదినాలను నిర్వహిస్తు న్నామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కే.హేమలత, బన్సీలాల్పేట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఎ.ఫహీమ్, టీఆర్ఎస్ డివిజన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎం.డి.జావేద్, అబ్బాస్, ఆసిఫ్, జహంగీర్, అక్తర్, రసూల్, అక్రమ్, టీఆర్ఎస్ నాయకులు కే.లక్ష్మిపతి, ఎన్.ప్రేమ్కుమార్లు హాజరయ్యారు.