మాదాపూర్ : ఈ నెల 25న జరగనున్న ప్లీనరీ సమావేశాన్ని దృష్టిలో ఉంచుకొని కమిటీ సభ్యులు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఎమ్మెల్సీలు నవీన్రావు, శంబీపూర్ రాజు, టీఎస్ఐఐసి చైర్మెన్ బాలమల్లుతో పాటు స్థానిక కార్పొరేటర్ వి. జగదీశ్వర్గౌడ్తో కలిసి ముందస్తు చర్యల్లో భాగంగా ప్లీనరీ సమావేశానికి చెందిన ఏర్పాట్ల పనులను సోమవారం పరిశీలించారు.
ఇందులో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి సభకు రానున్న ప్రతినిధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోనున్నారు. ట్రాఫిక్తో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, పార్కింగ్తో ఎటువంటి ఇబ్బందు లు రాకుండా అధికారులు, పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత పనులు ఏ విధంగా జరుగు తున్నాయో పరిశీలించి దిశానిర్ధేశాలు చేశారు.