అమీర్పేట్ : పేదలకు అత్యాధునిక వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు.అమీర్పేట్లో రూ.4.53 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఆసుపత్రిని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కేంద్ర మంత్రి జీ.కిషన్రెడ్డిలు ప్రారంభించారు. 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు త్వరలోనే ప్రారంభమవుతాయని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు.
పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉండాలన్న పెద్ద మనసుతో సీఎం కేసీఆర్ ఈ 50 పడకల ఆసు పత్రికి, అందుకు అవసరమైన నిధులకు లోటు లేకుండా చేశారని మంత్రి తలసాని సీఎంకు కృతజ్ఞతలు తెలపారు. 2012 లో ఉమ్మడి రాష్ట్రంలో అప్నటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ఆసుపత్రి నిర్మాణానికి రూ. 2.97 కోట్ల నిధులను మంజూరు చేసినా నిధులు ఎంతకీ విడుదల కాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ సర్కార్లో వైద్య సదుపాయాలకు పెద్ద పీట వేయడంతో ఈ ఆసుపత్రి నిర్మాణానికి మోక్షం లభించిందన్నారు. ఆరు పడకలతో ప్రసూతి సేవలకే పరిమితమైన ఈ ప్రాంగణాన్ని అత్యాధునిక వసతులతో 50 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకురావడం జరిగిందని, వెంటనే ఇందుకు సంబంధించిన అన్ని అనుమతులతో పాటు నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోఉన్నాయన్నారు.
ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే సనత్నగర్, ఎర్రగడ్డ, బోరబండ, ఫతేనగర్, యూసుఫ్గూడ, ఎల్లారెడ్డిగూడ, పంజా గుట్ట, శ్రీనగర్ కాలనీ పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉండడమే కాక గాంధీ, ఉస్మానియా వంటి పెద్ద ఆసుపత్రులపై భారం తగ్గతుందన్నారు.