ఉమ్మడి జిల్లాలో 41,867 యూనిట్లు
మొత్తం 8,79,207 గొర్రెలు పంపిణీ
ఒక్కో యూనిట్కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు
డీడీ కట్టిన లబ్ధిదారులకు గొర్రెలు
ఆనందంలో గొల్లకుర్మల కుటుంబాలు
సిద్దిపేట, మార్చి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయం.. గొల్లకుర్మల్లో ఆనందం చూడాలన్నదే సర్కారు లక్ష్యం.. గొర్రెల పెంపకం ద్వారా యాదవులు ఆర్థికంగా ఎదగాలన్న సంకల్పంతో గొర్రెల యూనిట్ల పంపిణీని ప్రభుత్వం పకడ్బందీగా చేపడుతున్నది. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని అర్హులను గుర్తించి, మొదటి విడుత గొర్రెల పంపిణీని ప్రభుత్వం పూర్తి చేసింది. ఆయా గ్రామాల్లో 18ఏండ్లు పైబడి, అర్హత గలిగిన వారికి దశల వారీగా యూనిట్లు అందజేస్తున్నది. సిద్దిపేట జిల్లాలో 500, మెదక్ జిల్లాలో 744, సంగారెడ్డి జిల్లాలో 2,487 యూనిట్లకు లబ్ధిదారులు డీడీలు కట్టగా, గ్రౌండింగ్ పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే కొన్ని యూనిట్లను అధికారగణం అందజేసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన గొర్రెలతో గొల్లకుర్మల ఇంట సంబురం నెలకొన్నది.
సిద్దిపేట, మార్చి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయాలన్నదే ప్రభు త్వ ధ్యేయం.. గొల్లకుర్మల్లో ఆనందం చూడాలన్నదే సర్కారు లక్ష్యం.. గొర్రెల పెంపకం ద్వారా యాదవులు ఎదగాలన్న సంకల్పం.. ఇందుకుగానూ 75శాతం సబ్సిడీపై గొర్రెల యూనిట్లను సర్కారు అందిస్తున్నది. ‘గొర్రెల పెంపకం.. అభివృద్ధి’ పథకాన్ని తొలుత సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో 2017 జూన్లో సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. అప్పటి నుంచి దశలవారీగా గొర్రెల యూనిట్లను లబ్ధిదారులకు అందిస్తున్నారు. దీంతో గొర్రెల మంద రోజురోజుకూ పెరుగుతున్నది. గొర్రె పిల్లలు ఎదుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన గొర్రెలతో గొల్లకుర్మల ఇంట సంబురం నెలకొం ది. ఉమ్మడి మెదక్ జిల్లాలో గొర్రెల యూనిట్లతో గొల్లకుర్మల అభివృద్ధి చెందుతున్నారు. సిద్దిపేట జిల్లాలో 15,294యూనిట్లు, మెదక్ జిల్లాలో 12,271 యూనిట్లు, సంగారెడ్డి జిల్లాలో 14,302 యూనిట్లకు గొర్రెలను పంపిణీ చేశారు. ఒక్కో యూనిట్కు 20 గొర్రె లు, ఒక పొట్టేలు అందించారు. కాగా, సిద్దిపేట జిల్లాలో 500, మెదక్ జిల్లాలో 744, సంగారెడ్డి జిల్లాలో 2,487 యూనిట్లకు లబ్ధిదారులు డీడీలు కట్టారు. ఈ లబ్ధిదారులందరివి గ్రౌండింగ్ పూర్తి చేసి, త్వరలోనే గొర్రెలను అం దేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే కొన్ని యూనిట్లను అధికారులు ప్రారంభించారు.
ఉమ్మడి జిల్లాలో గొర్రెల పంపిణీ ఇలా..
గొర్రెల పెంపకం అభివృద్ధి పథకం ద్వారా సిద్దిపేట జిల్లా లో 412 ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలున్నాయి. ఇందుకు 15,232 గొర్రెల యూనిట్లు పంపిణీ చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 3,19,872 గొర్రెలను అందించారు. దీనికి ప్రభుత్వం జిల్లాకు దాదాపుగా రూ.147కోట్లు ఖర్చు చేసింది. ఇటీవల తొగుట మండలంలో 62 యూనిట్లు ఇచ్చారు. మరో 500 యూనిట్లకు డీడీలు కట్టగా, వీటిని దశలవారీగా ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డీడీలు కట్టిన వారందరికీ ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటివరకు పంపిణీ చేసి న గొర్రెల్లో వివిధ కారణాలతో సుమారుగా 2,981 గొర్రె లు మృతి చెందాయి. వీటిలో 2,184 గొర్రెలకు బీమా పథకం ద్వారా వచ్చిన పరిహారంతో 1,305 గొర్రెలను లబ్ధిదారులకు ఇప్పించారు. 15,232 గొర్రెల యూనిట్లకు ఉచితంగా దాణా పంపిణీ చేశారు.
మెదక్ జిల్లాలో 343 సహకార సంఘాలున్నాయి. వీటిలో మొత్తం 20,182మంది సభ్యులున్నారు. 13,025మంది డీడీలు కట్టారు. ఇప్పటి వరకు 12,229 యూనిట్లకు గొర్రెలు అందించారు. ఇంకా 796 యూనిట్లకు డీడీలు కట్టి ఉన్నాయి. వీరిలో వారం కిందట టేక్మా ల్ మండలంలోని మూడు గ్రామాల్లో 52 యూనిట్లు అందించారు. మిగిలిన 744 యూనిట్ల వారికి విడుతల వారీగా ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో 14,302 యూనిట్లకు గొర్రెలను పంపిణీ చేశారు. మొత్తం 3,00,342 గొర్రెలను లబ్ధిదారులకు అందించారు. ప్రతి గొర్రెకు ప్రభుత్వం బీమా చేయించింది. పంపిణీ చేసిన గొర్రెలలో 4,427 మృత్యువాతపడ్డాయి. వీటిలో ఇప్పటివరకు 126 మగ వాటికి, 3010 ఆడ వాటికి బీమా వర్తించింది. జిల్లాలో ఇంకా మొదటి విడుతలో 123 పెండింగ్ డీడీలతో పాటు రెండో విడుతలోని 2,364 డీడీలు కట్టారు. డీడీలు కట్టిన లబ్ధిదారులకు త్వరలోనే గొర్రెలు అందించనున్నారు.
అర్హులకు దశలవారీగా యూనిట్లు..
సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని అర్హులను గుర్తిం చి, మొదటి విడుత గొర్రెల పంపిణీని ప్రభుత్వం పూర్తి చేసింది. ఆయా గ్రామాల్లో 18ఏండ్లు పైబడి, అర్హత గలిగిన వారికి దశలవారీగా యూనిట్లు అందజేస్తున్నది. ఒక్కో యూనిట్కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందిస్తున్నది. ఒక్క యూనిట్ ధర రూ.1.25లక్షలు కాగా, ఇందులో లబ్ధిదారుడి వాటా రూ.31,250.. ప్రభుత్వ సబ్సిడీ రూ.93,750 ఉంటుంది. ప్రతీ గొర్రెకు బీమా సౌకర్యం కల్పిస్తున్నది. ఒక్కో యూనిట్కు 206.4 కిలోల దాణాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది. అత్యవస ర చికిత్స కోసం ప్రజలకు ఏ విధంగా 108 వాహనం ఉపయోగపడుతుందో.. అలాగే, పశువులు, గొర్రెలకు నూతనంగా 1962 పశువైద్య వాహనాలను నియోజకవర్గానికి ఒకటి చొప్పున అన్ని గ్రామాలకు అందుబాటు లో ఉండేలా ఏర్పాట్లు చేసింది. పశుగ్రాసం వృథాను అరికట్టడానికి గ్రాస్ కట్టింగ్ మిషన్లను 50శాతం సబ్సిడీపై సన్న, చిన్న కారు రైతులకు అందిస్తున్నది. గొర్రెల అభివృద్ధి పథకం లబ్ధిదారులకు 75శాతం సబ్సిడీపై ఈ యంత్రాలను ఇస్తున్నది.