ముషీరాబాద్ :ముషీరాబాద్ డివిజన్ ఈస్ట్ ఎంసీహెచ్ క్వార్టర్స్లోని మల్టీ స్పోర్ట్స్కాంప్లెక్స్ను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ పరిశీలించారు. క్రీడా కాంప్లెక్స్లో సౌకర్యాల తీరును అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన విద్యుత్ సరఫరా నిలిపివేయడం పట్ల స్పోర్ట్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్దరించాలని ఆదేశించారు.
క్రీడా భవనంలో ఆయా విభాగాల ఆటగాళ్ల కోసం అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, ముచ్చకుర్తి ప్రభాకర్, నేత శ్రీనివాస్, మాధవ్, శ్యామ్సుందర్, దీన్దయాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.