పటాన్చెరు/రామచంద్రాపురం: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. ప్రొటెం చైర్మన్గా నియమితులైన తర్వాత మొట్టమొదటి సారిగా శాసనమండలి సమావేశాలు జరుగుతుండటంతో ఆయన సీఎం కేసీఆర్ను కలిశారు. ఆయనతో పాటు ఆర్థిక మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్సీలు భానుప్రసాద్ , పల్లా రాజేశ్వర్రెడ్డి, ఫారుక్ హుస్సేన్ ఉన్నారు.