బడంగ్పేట :ఓ వ్యక్తి అదృశ్యం అయిన సంఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందిహిల్స్ కాలనీలో నివాసం ఉండే చిన్నోదు (48) ఈనెల 23న ఇంటినుంచి పోయి తిరిగి రాలేదని కుటుంబసభ్యులు మీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బంధువుల ఇండ్లలో వెతికినా సమాచారం లేక పోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యప్తు చేస్తున్నామని సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు.