బండ్లగూడ: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అదివారం మల్లన్న కళ్యాణ మహోత్సవం యాదవులు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నిర్వహించే మల్లన్న కళ్యాణ మహోత్సవంలో యాదవులతో పాటు గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొంటారు.
ఈ కళ్యాణ మహోత్సవంలో డోలు తాళాలతో ఒగ్గు కళాకారులు చేసిన విన్యాసాలు స్థానికంగా అందరిని అలరించింది. ఈ యేడు జరిగిన కళ్యాణ మహోత్సంలో కార్పొరేటర్ పద్మవతి పాపయ్య యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.