మహబూబ్నగర్టౌన్, అక్టోబర్ 19 : అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అన్నారు. జిల్లా కేంద్రంలోని 26, 27 వార్డుల్లో బుధవారం ఆసరా పథకం నూతన లబ్ధిదారులకు పింఛన్కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబ్నగర్ పట్టణంలో 2014 కు ముందు ప్రతినెలా 10,515మందికి రూ.31లక్షల పింఛన్లు అందించగా, తెలంగాణ వచ్చిన తర్వాత 19,907మందికి ప్రతినెలా రూ.4.24కోట్ల పింఛన్లు అందిస్తున్న ట్లు తెలిపారు. పింఛన్ల రూపంలో ప్రభుత్వం ప్రతి ఏడాది పేదలకు రూ.50.88కోట్లు అందించి అండగా నిలుస్తున్నదని చెప్పారు.
ఒక్క మహబూబ్నగర్ పట్టణంలోనే గడిచిన ఎనిమిదేండ్లలో మంత్రి శ్రీనివాస్గౌడ్ కృషితో రూ.407.04కోట్లు ఆసరా పథకం పింఛన్దారులకు అందజేశామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్తో పేదల బతుకులకు భరోసా ఏర్పడిందన్నారు. ము న్సిపాలిటీలో అర్హులైన ప్రతిఒక్కరికీ పింఛన్ మంజూరుకు కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా నాలుగోవార్డు ఎదిరలో కౌన్సిలర్ యాదమ్మ, ఏడోవార్డులో కౌన్సిలర్ కట్టా రవికిషన్రెడ్డి ఆసరా పథకం లబ్ధిదారులకు పింఛన్కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ గంజి వెంక న్న, మున్సిపల్ వైస్చైర్మన్ తాటి గణేశ్, కౌ న్సిలర్లు సంధ్య, షేక్ ఉమర్, మోతీలాల్, వేదవ్రత్, మాజీ కౌన్సిలర్ శివశంకర్, నా యకులు హన్మంతు, సూద నర్సింహులు, వెంకటయ్యగౌడ్, ఎల్లయ్య, శ్రీనివాస్రెడ్డి, తిరుపతయ్య, బాలరాజు పాల్గొన్నారు.