శంషాబాద్ రూరల్ : శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలోని అమ్మపల్లిదేవాలయం శివాలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా ఆలయ చైర్మన్, ధర్మకర్తల ఆధ్వర్యంలో మహా అభిషేకం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శంషాబాద్ జడ్పీటీసీ నీరటి తన్విరాజు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా మూలంగా అనేక ఇబ్బందులు పడి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
ప్రజలందరినీ చల్లగా చూడాలని దేవున్ని ప్రార్థించాము. ఇబ్బందులు లేకుండా చేయాలని స్వామివారికి అభిషేకం చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వినోద్కుమార్, ఆలయధర్మకర్తలు లావణ్యవిశ్వనాధం, శ్రీనివాస్, కృష్ణ, మాలతిచంద్రశేఖర్, ఆశోక్, నర్కూడ గ్రామ కమిటీ అధ్యక్షుడు నీరటి శేఖర్, ఆలయ సిబ్బంది శ్రీనివాస్, అర్చుకులు సత్యనారాయణశర్మ, అన్వేశ్శర్మ తదితరులు పాల్గొన్నారు.