సికింద్రాబాద్ : కార్మికుల కుటుంబాల్లో జీవిత బీమా వెలుగులు నింపుతుందని కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ఇటీవల కొవిడ్తో చనిపోయిన కార్మిక కుటుంబాలకు భారతీయ జీవిత బీమా పథకం కింద బీమా సొమ్మును అందించారు. కొవిడ్తో 14 మంది కార్మికులు మృత్యువాత పడగా, ప్రస్తుతం 8 మందికి బీమా చెక్కులు అందాయి. త్వరలోనే మిగతా ఆరుగురికి బీమా సొమ్ము అందనుంది. ఒక్కొక్కరికీ రూ.5లక్షల చొప్పున మంజూరైన చెక్కులను కార్మిక కుటుంబాలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సీఈఓ అజిత్రెడ్డి మాట్లాడుతూ కొవిడ్ మహమ్మారి కారణంగా దేశంలోని 62 కంటోన్మెంట్లలో విధులు నిర్వర్తిస్తున్న20వేల మందికి జీవిత బీమా చేయించడం జరిగిందన్నారు. దీంట్లో భాగంగానే కంటోన్మెంట్లో సైతం సుమారు 15వందల మందికి బీమా చేయించారని చెప్పారు. పారిశుద్ధ్యం, ఎలక్టిసిటీ, వాటర్ వర్క్తో పాటు పలు విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఈ ఏడాది కూడా జీవిత బీమా పథకానికి సంబంధించి రెన్యువల్ చేయించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ విజయ్కుమార్ బాలన్నాయర్తో పాటు అధికారులు దేవేందర్, మహేందర్, పరుశరామ్తో పాటు దఫేదార్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.