శేరిలింగంపల్లి : వినూత్న ఆలోచనలతో సరికోత్త అవిష్కరణలతో ముందుకువచ్చే ఔత్సాహికులకు చేయూతనందించేందు కు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్లోని క్యూసిటీ ఐటీ పార్క్ ‘‘క్యూ హబ్ స్టార్టఫ్ ల్యాబ్స్’’ను అవిష్కరించింది. క్యూ సిటీ డైరక్టర్ హరీ క్రీజెన్, జనరల్ మేనేజర్ మాలతీ మరిశెట్టిలు బుధవారం ఈ ల్యాబ్ను లాంఛనంగా ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన లోగోను వారు అవిష్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ క్యూ సిటీ ఐటీ పార్క్ క్యాంపస్లో కొలువుదీరిన వివిధ సంస్ధల ఔత్సాహికులకు చేయూత నందించేందుకు సరికొత్తగా క్యూ హబ్ స్టార్టప్ ల్యాబ్స్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. నూతన స్టార్టప్లకు మెంటర్షిప్ను అందజేస్తు వారిని భవిష్యత్తు ఎంట్రప్యూనీయర్లుగా తీర్చిదిద్దేందుకు ఈ ల్యాబ్స్ ఎంతగానో సహాయ పడుతుందని అన్నారు.
ఈ క్యూ హబ్లో నూతన ఔత్సాహికుల సరికొత్త అవిష్కరణలకు ఉచితంగా ప్రపంచస్థాయి సౌకర్యాలతో కూడిన సదుపా యాలు కల్పిస్తు వారి నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చెందుకు తగిన తోడ్పాటును అందిస్తామన్నారు. దీంతో పాటు క్యూసిటీ కొడెథాన్ పేరిట కోడింగ్రంగంలో ఉన్న సవాళ్లను అధిగమించేందుకు ఏర్పాటుచేసిన షోకేస్లో క్యూసిటీలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న వారందరు పాల్గొని రూః 5,50,000 విలువ కలిగిన నగదు బహుమతులను గెలుచుకునే అవకాశాన్ని కల్పించడం జరిగిందని తెలిపారు.