కవాడిగూడ :దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి అహర్నిశలుకృషి చేస్తున్నదని అఖిల భారత విద్యార్థి యువజన జేఏసీ చైర్మన్ సగరపు ప్రసాదరావు అన్నారు. దళితబంధుపై విషప్రచారం చేస్తున్న రేవంత్రెడ్డి దళితులను రాజకీయాలకు వాడుకుంటున్నాడని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం లోయర్ట్యాంక్ బండ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రెవంత్రెడ్డి ప్లెక్సీని దహనం చేసేందుకు విద్యార్థి జేఏసీ ప్రతినిధులు ప్రత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద బైటాయించి ధర్నా నిర్వహించారు. రేవంత్రెడ్డి వ్యాక్యలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్రావు మాట్లాడుతూ దళిత గిరిజన సభల పేరుతో సీఎం కేసీఆర్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలుపై రేవంత్ రెడ్డి విమర్శలు చేయడం సరైంది కాదని అన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చేపుతారని ఆయన హెచ్చరించారు. దళితులను కించపరిచే విధంగా మాట్లాడుతున్న రేవంత్రెడ్డికి దళిత గిరిజన సభలు పెట్టే అర్హతలేదని ఆయన అన్నారు.
రేవంత్రెడ్డి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలు కాలిగోటితో సమానమని ఆయన అన్నారు. దళితబంధు దేశంలోనే విప్లవాత్మక పథకమని అన్నారు. ఓటుకు నోటు కేసులో జైలు జీవితం గడిపిన రేవంత్రెడ్డి కేసీఆర్, మోత్కుపల్లిని విమర్శించే అర్హతలేదని ఆయన హెచ్చరించారు. రేవంత్ రెడ్డి దళిత వాడల్లోకి వస్తే డప్పులతో చేప్పులతో దేహశుద్ది చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, రాజు, శ్రీనివాస్, దేవాన్స్, మల్లేష్, వెంకన్న, శ్రీనివాస్ రెడ్డి, ద్వారకేష్ తదితరులు పాల్గొన్నారు.