బన్సీలాల్పేట్: క్షత్రీయ రాజ్పుత్ సభ సికింద్రాబాద్ కుత్బిగూడ నూతన కార్యవర్గ కమిటీ అధ్యక్షుడిగా కేదార్నాథ్ సింగ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా రవికిరణ్ సింగ్, శోభ సింగార్, మనోహర్ సింగ్, అజయ్సింగ్లు వ్యవహరించారు. నూతన కమిటి కార్యదర్శిగా నితీశ్ సింగ్, కోశాధికారిగా వినోద్సింగ్, కార్యవర్గ సభ్యులుగా శైలేశ్ సింగ్, విక్రాంత్ సిణగ్, ఉమారాణిలు ఎన్నికయ్యారు
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కేదార్నాథ్ సింగ్ మాట్లాడుతూ కరోన విపత్కర పరిస్థితిలో ఆర్థికంగా ఇబ్బందులలో నిరుపేద క్షత్రీయ రాజ్పుత్ కుటుంబాలకు చెందిన వారికి చేయూతనందించి ఆదుకుంటామని అన్నారు. ప్రతిభా వంతులైన పేద విధ్యార్థులకు స్కాలార్షిల్ప్లు ఇవ్వడానికి ఐదు లక్షల రూపాయల నిధి సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పటికే సికింద్రాబాద్లో వందలాది మంది పేదలకు నిత్యావసరాలను పంపిణి చేశామని, రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన అన్నారు.