వైభవంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం
తిలకించి పులకించిన భక్త జనం
తిమ్మాపూర్, మార్చి 18: మండలంలోని ఎల్ఎండీ కాలనీలో గల వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆండాళ్పద్మావతీ సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం నిత్య పూర్ణాహుతి, ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. సాయంత్రం వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాన్ని వేద పండితులు గోవర్ధన వెంకటాచార్యులు, గోవర్ధన శ్రీకాంత్చార్యులు వైభవంగా జరిపించారు. రాత్రి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. శ్రీ మృత్యుంజయ దేవాలయం తరఫున ఆలయ ప్రతినిధులు చల్లా మోహన్రెడ్డి, సంగెం లక్ష్మణ్రావు స్వామి వారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. కల్యాణాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఎస్సారెస్పీ ఈఎన్సీ శంకర్, చీఫ్ ఇంజినీర్ కొట్టె సుధాకర్రెడ్డి, వేంకటేశ్వర ఆలయ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి మామిడి రమేశ్, కోశాధికారి పోలు కిషన్, మృత్యుంజయ దేవాలయ అధ్యక్షుడు చల్లా మోహన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగెం లక్ష్మణ్రావు, ఇఫ్కో రాష్ట్ర డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ కుంట రాజేందర్రెడ్డి, సర్పంచ్ జక్కని శ్రీవాణి, ఉప సర్పంచ్ మడుపు శ్రీనివాస్రెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు రామకృష్ణ, గంగారపు రమేశ్, ఒంటెల రవీందర్రెడ్డి, ఒంటెల ప్రసాద్రెడ్డి, రాగి శ్రీనివాస్, కొలుగూరి వెంకటేశ్వర్రావు, చాడ నర్సింహారెడ్డి, బట్టు కరుణాకర్, గడప శేఖర్, రాంబాబు, అశోక్, సదానందం, పద్మావతీ మహిళా మండలి సభ్యులు రాణి, పరమేశ్వరి, సమత, గీత, నీటిపారుదల శాఖ అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.