కొండగట్టులో వైభవంగాఅఖండ హనుమాన్ చాలీసా పారాయణం
అట్టహాసంగా ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత
అంతకుముందు ఐదు కోట్ల రామకోటి ప్రతులతో అంజనాద్రిపై శోభాయాత్ర
మల్యాల, మార్చి 17 : పవిత్ర పుణ్యక్షేత్రమైన కొండగట్టులో అఖండ హనుమాన్ చాలీసా పా రాయణ అంకురార్పణ కార్యక్రమం బుధవారం వైభవోపేతంగా జరిగిం ది. కొండగట్టు అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో రెండు మండలాల కాలం పాటు సాగే అఖండ హనుమాన్చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అఖిల భారత హనుమాన్ పీఠాధిపతి దుర్గా ప్రసాద్ స్వామిజీ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. వరంగల్కు చెందిన చక్రపాణి తాను రాసిన రామకోటి ప్రతులతో పాటు, మద్రాసులో తన సన్నిహితులు పూర్తి చేసిన ఐదకోట్ల రామకోటి ప్రతులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అందజేశారు. వారి నుంచి రామకోటి ప్రతులను స్వీకరించిన ఎమ్మెల్సీ కవిత, శోభాయాత్రగా ప్రధాన ఆలయానికి బయలుదేరారు. ఎమ్మెల్సీ కవిత హనుమాన్ మందిరానికి చేరుకొని పారాయణ వేదికపైనే ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థలంలో రామకోటి ప్రతులను భద్రపర్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆలయాలతో పాటు, ప్రజలు స్వచ్ఛందంగా తమ ఇండ్లల్లో ప్రతి రోజూ కొండగట్టులో హనుమా న్ చాలీసా జరిగే సమయంలో చాలీసా పారాయణం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.