అనాథ విద్యార్థులకు పండ్లు, స్కూల్ బ్యాగులు పంపిణీ
అంధుల పాఠశాలకు ఫ్యాన్లు, నిత్యావసర సరుకులు వితరణ
మంత్రి శ్రీనివాస్గౌడ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న టీఆర్ఎస్, టీఎన్జీవో ఉద్యోగ సంఘం నాయకులు
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మార్చి 16 : పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సూచనల మేరకు రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్, గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మొక్కలు నాటారు.
ఎక్సైజ్, క్రీ డా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ జన్మదిన వేడుకలను మం గళవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్, టీఎన్జీవో ఉద్యోగ సంఘం నాయకులు శాంతివన్ అనాథ శరణాలయంలో, అంధుల పా ఠశాలలో విద్యార్థులతో కలిసి కేక్ కట్చేశారు. అలాగే అనాథ విద్యార్థులకు పండ్లు, దుప్పట్లు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడంతోపాటు అంధుల పాఠశాలలో ఫ్యాన్లను వితరణ చేశారు. అలాగే నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్ర మం ఏర్పాటు చేశారు. పట్టణంలోని టీడీ గుట్టకు చెందిన ఆకర్శణ మహిళా సమాఖ్య సభ్యులు ఏనుగొండ అనాథ శరణాలయంలో విద్యార్థులకు క్విం టాల్ బియ్యం వితరణగా అందజేశారు.
ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కె.వెంకటయ్య, మున్సిపల్ వైస్చైర్మన్ తాటి గణేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, కౌన్సిలర్లు కట్టా రవికిషన్రెడ్డి, రాంలక్ష్మణ్, మునీర్, శ్రీనివాస్రెడ్డి, రోజా, వనజ, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదీప్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్, జావిద్బేగ్, అంజద్, ప్ర మోద్, గణేశ్, సత్యపాల్, టీఎన్జీవో ఉద్యోగ సంఘం నాయకులు క్రాంతి కుమార్గౌడ్, రాజగోపాల్, జిల్లా అ ధ్యక్షుడు రాజీవ్రెడ్డి, చంద్రనాయక్, డీటీ నాగార్జున, మం త్రి పీఏ దేవేందర్, నాయకులు శ్యాంసుందర్రెడ్డి, కృష్ణమోహన్, మహేశ్వర్రెడ్డి, రవీందర్నాథ్, నరేందర్, తఖీ బాబా, రంగయ్య, లక్ష్మీనరసింహ, రామలక్ష్మమ్మ, కృష్ణవేణి, గీత, శివలీల, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.