అంబర్పేట : అంబర్పేట నియోజకవర్గంలో ఇక నుంచి జోరుగా అభివృద్ధి పనులు జరుగనున్నాయని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో బీటీ, సీసీ, వీడీసీసీ రోడ్డు పనులను చేపడుతున్నట్లు చెప్పారు. బాగ్అంబర్పేట డివిజన్లోని అజీజ్బాగ్లో రూ.20లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను డివిజన్ కార్పొరేటర్ బి.పద్మవెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుసగా రెండు, మూడు నెలల పాటు అన్ని ప్రాంతాలలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కొన్ని కోట్లు ఖర్చుపెట్టి బస్తీలు, కాలనీల్లో రోడ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. రోడ్లతో పాటు మంచినీరు, డ్రైనేజీ, వర్షపునీటి పైప్లైన్ పనులను కూడా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆయా బస్తీలు, కాలనీల్లో నిర్మిస్తున్న రోడ్లను నాణ్యతతో ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో బస్తీ, కాలనీ ప్రజలు కూడా రోడ్డు పనులను పరిశీలించాలన్నారు. నాణ్యత లేకుంటే కాంట్రాక్టర్లను నిలదీయాలని చెప్పారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ నాణ్యతతో జరిగేలా చూడాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ సుధాకర్, ఏఈ ప్రేరణ, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, నాయకులు శ్రీరాములుముదిరాజ్, నవీన్యాదవ్, శివాజీయాదవ్, మిర్యాల రవీందర్, చంద్రమోహన్, బాబు, మహేష్, ప్రదీప్, దారయోబు, రాజేష్, చంద్రశేఖర్, శ్రీశైలం, కాలనీవాసులు శేఖర్రెడ్డి, సురేందర్గౌడ్, శేఖర్, రామకృష్ణరెడ్డి, కరుణాకర్రెడ్డి, సంతోష్, మురళీధర్రావు, దామోదర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.