బంజారాహిల్స్ : బకెట్లో ఉన్న వేడినీళ్లు మీదపడడంతో బాలుడికి తీవ్రగాయలయిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్లోని బీజేఆర్నగర్లో నివాసం ఉంటున్న జక్కా ఓబులేష్, లక్ష్మీదేవి దంపతులకు జక్కా జైవిష్ణోదరన్ (4) అనే కొడుకు ఉన్నాడు. ఈ నెల 15న సాయంత్రం కొడుకుకు స్నానం చేయించేందుకు బకెట్లో నీళ్లు పోసి హీటర్ను ఆన్ చేసిన లక్ష్మీదేవి కిచెన్లోకి వెళ్లింది.
కాసేపటికి నీళ్లు మరుగుతున్న సమయంలో అక్కడకు వచ్చిన జై విష్ణోదరన్ బకెట్వద్దకు వెళ్లి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ వేడినీళ్లు మీదపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చి చికిత్స అంది స్తున్నారు. సుమారు 35శాతం కాలిన గాయాలయ్యాయని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఈ మేర కు బాలుడి తల్లి శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.