కందుకూరు : 75వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను కందుకూరు మండలంలో ఘనంగా జరుపుకున్నారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆర్డీఓ వెంకటాచారి జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐ క్రిష్ణంరాజు , తాసీల్దార్ జ్యోతి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, దేవరశెట్టి చంద్రశేఖర్, ఎంపీడీఓ క్రిష్ణకుమారి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్లు పాల్గొన్నారు.
మండల పరిషత్ కార్యలయం వద్ద జరిగిన కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి జెండా ఆవిష్కరించగా పీఎసీఎస్ వైఎస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్రెడ్డి.ఎంపీటీసీలు, సురుసాని రాజశేఖర్రెడ్డి, తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, రాములు, యాదయ్య, అధికారులు కవిత, సుదర్శన్రెడ్డి, సుచరిత, విష్ణువర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు దేశం మోహన్రెడ్డి, సదానంద్గౌడ్, పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీకాంత్ గుప్తా, కుంచకూరి వెంకటేశ్వర్లు గుప్తాలు పాల్గొన్నారు.