మాదాపూర్ :మాదాపూర్లోని శిల్పారామంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా శ్రీ లలితా స్కూల్ ఆఫ్ డ్యాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లలిత సింధూరి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.
ఇందులో భాగంగా పుష్పాంజలి, ఘేయ్ ఘేయ్ తనను, జతిస్వరం, బ్రహ్మంజలి, రుక్మిణి ప్రవేశ దరువు, దశావతారాలు, అష్టలక్ష్మీ స్తోత్రం, వినరో భాగ్యము, తారంగం, తిల్లాన వంటి ప్రదర్శనలతో చూపరులను మంత్రముగ్ధులను చేశారు.