శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో సోమవారం కస్టమ్స్ అధికారులు భారీమొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. రియాద్ నుంచి వచ్చిన విమానంలో బయలుదేరిన ఓ వ్యక్తి బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. నగరానికి చెందిన సురేందర్ అనే ప్రయాణీకుడు తనిఖీలో స్మగ్లర్ బంగారంను శరీరం అంతర్భాగం దుస్తులలో తీసుకువచ్చినట్లు గుర్తించారు. బిస్కట్ రూపంలో లోదుస్తులలో అక్రమంగా తెచ్చిన బంగారం 10 తులాలు ఉందని తెలిపారు. ఈ మేరకు పట్టుబడిన బంగారం స్వాధీనం చేసుకొన్నారు. స్మగ్లర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.