కాచిగూడ : ప్రజల సహాకారంతో నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెలుతున్నట్లు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాక డివిజన్లోని నింబోలిఅడ్డా ఎస్సీహస్టల్ సమీపంలో రూ.6 లక్షల రూపాయలతో చేపట్టిన ఫుట్పాత్ నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే, కార్పొరేటర్ నింబోలిఅడ్డా, తదితర బస్తీలలో పాదయాత్ర నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
స్థానికులు వర్షాలు వచ్చినప్పుడు ఇండ్లల్లోకి నీరు వస్తుందని, దీంతో అనేక ఇబ్బందులు గురవుతున్నామని ఎమ్మెల్యేకు పిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పుట్పాత్లను ఆధునీకరించి, సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అభివృద్ధి పనులను త్వరితగతీన పరుగులు పెట్టిస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు. నిర్మాణపు పనుల్లో స్థానికులు అధికారులను ఎప్పటికప్పుడు నిలదిసినప్పుడే అభివృద్ధి పనులు జరుగుతాయని ఆయన సూచించారు. ప్రజా సమస్యలను సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ఆయన అధికారులను హెచ్చరించారు.
బస్తీలో ఉన్న సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికై కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎస్సీ హస్టల్లైన్లో నెలకొన్న సమస్యలను త్వరితగతీన పరిష్కరిస్తానని స్థానికులకు ఎమ్మెల్యే హామి ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు దూసరి శ్రీనివాస్గౌడ్, జీహెచ్ఎంసీ డీఈ సుధాకర్, ఏఎంహెచ్ఓ జ్యోతి, ఏఈ ఫరీద్, మనోహర్, శాకీర్, హార్టికల్చర్ ఏఈ సత్య, ఆర్కే బాబు, కాశీ నరేశ్, నర్సింగ్యాదవ్, పల్లవి,రెడపాక రాము, అనిల్యాదవ్, పి.అంజయ్యచారి, ప్రభాకర్ముదిరాజ్,పి.సంతోశ్, సతీశ్, జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.