అంబర్పేట/గోల్నాక : బస్తీలలో నిర్మించిన కమ్యూనిటీహాళ్లను బస్తీవాసులు ఒక ఇల్లులా చూసుకోవాలని కేంద్ర సాంస్కృ తిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. కమ్యూనిటీహాళ్ల నిర్మాణం, అందులో వసతుల కల్పనకు తన ఎంపీ నిధులను కేటాయిస్తానని చెప్పారు.
అంబర్పేట నియోజకవర్గంలోని గోల్నాక డివిజన్ గంగానగర్లో రూ.13 లక్షలు, శంకర్నగర్లో రూ.12 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీహాళ్లను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్తో కలిసి కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి ఆదివారం ప్రారంభించారు. అనంతరం బాగ్అంబర్పేట డివిజన్లోని పోచమ్మబస్తీలో 13.70 లక్షలతో ఒకటి, రూ.13.50లక్షలతో మరో కమ్యూనిటీ హాళ్లు రెండింటిని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్ బి.పద్మవెంకటరెడ్డిలతో కలిసి కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బస్తీ ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. కిషన్రెడ్డి మాట్లాడుతూ బస్తీ ప్రజల అవసరాల కోసం, మహిళా సంఘాల సమావేశం, ఇతరాత్ర చిన్న చిన్న సమావేశాలు నిర్వహించుకునేందుకు కమ్యూనిటీహాళ్లను ఉపయోగించుకోవాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు కందూరి దశరథ, ధనంజయ, దేశం పాండు, రంగంపల్లి రాజు, మహేందర్గౌడ్, కెంచె చంద్రశేఖర్, దడిగె జగన్, పి.అవినాష్గౌడ్, ఈశ్వర్, శ్రీనివాస్, కపిల్దేవ్, జితేంద్రగౌడ్, సురేందర్గౌడ్, శ్రావణ్, లక్ష్మణ్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.