చిక్కడపల్లి : ఒంటరి మహిళలకు తమవంతు సహాయం అందిస్తున్నామని భూమిక నిర్వాహకురాలు సత్యవతి తెలిపారు. శుక్రవారం బాగ్లింగంపల్లిలో ఉమెన్స్కలెక్టివ్, హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ ఆర్థిక సహకారంతో ఒంటరి మహిళలకు కుట్టు మిషన్లు ఇతర ఉపకరణాలను అందించారు. ఈ సందర్భంగా సత్యవతి, సంస్థ డైరెక్టర్ ప్రశాంతిలు మాట్లాడుతూ బాగ్లింగంపల్లి తదితర బస్తీలలో నివసిస్తున్న ఒంటరిమహిళలకు, కరోనా బారినపడి సంపాదించే వారిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను గుర్తించి వారికి జీవనోపాధికి అవసరమయ్యే పరికరాలను అందించామని వివరించారు.