కవాడీగూడ : దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్ళకు ఆర్థిక సహాయం చేస్తున్నది కేవలం కేసీఆర్ ప్రభుత్వం మాత్రమేనని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కుల మతాలతో సంబంధం లేకుండా కల్యాణ లక్ష్మీ, సాదీ ముబారక్ పథకాల ద్వారా బడుగు బలహీన వర్గాలకు తోడ్పటునందించడం జరుగుతుందన్నారు.
మంగళవారం రాంనగర్ డివిజన్ ఎస్ఆర్టీ కమ్యూనిటీహాల్లో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతియేటా వేలాది మందికి కల్యాణ లక్ష్మీ పథకం ద్వారా ప్రభుత్వం చేయూతనందిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాంనగర్, ముషీరాబాద్ కార్పొరేటర్లు రవిచారి, ఎం.సుప్రియా నవీన్ గౌడ్, ముషీరాబాద్, హిమాయత్నగర్ తాసీల్దార్లు జానకి, లలిత, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.