కందుకూరు, మహేశ్వరం :గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపోర్లుతున్నాయి. కందుకూరు మండలంలోవాన దంచి కొట్టింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియడంతో మండలంలోని కొత్తగూడ, జైత్వారం, దన్నారం, పులిమామిడి, చిప్పలపల్లి, బాచుపల్లి తదితర గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండి అలుగులు పారుతున్నాయి.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, ఉపరితల అవర్తనాల ప్రభావంతో వానలు ముంచెత్తున్నాయి. మీర్ఖాన్పేట్, ఆకులమైలారం చెరువుల్లోకి భారీగా వర్షం నీరు రావడంతో మత్స్యకారులు చేపలు పట్టారు. భారీ వర్షాలకు మహేశ్వరం మండల పరిధిలోని కోళ్లపడకల్ చెరువు అలుగుపారుతుంది.వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి వరదలు రావడంతో చెరువునిండి మత్తడి దుంకుతుంది. చెరువు మత్తడి దుంకి రోడ్డుమీదకు రావడంతో చిన్నారులు నీళ్లలో ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.