శేరిలింగంపల్లి : గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అధ్వర్యంలో ‘‘ఎన్ఎండీసీ గ్రేస్ క్యాన్సర్ రన్-2021’’ కార్యక్రమం ఆదివారం నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో ఉత్సాహాంగా జరిగింది. ఈ అతిపెద్ద క్యాన్సర్ రన్ 4వ ఎడిషన్ కార్యక్రమానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ముఖ్యఅతిధిగా హాజరై జెండా ఉపి ప్రారంభించారు.
గౌరవ అతిధులుగా రాష్ట్ర మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎన్ఎండీసీ సీఎండీ సుమిత్ దూబే, గ్రేస్ క్యాన్సర్ పౌండేషన్ సీఈఒ చిన్నబాబు, గ్రేస్ క్యాన్సర్ రన్ డైరక్టర్ నిరంజన్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అజాదీకా అమృత్ మహోత్సవ్ స్పూర్తితో క్యాన్సర్ నుంచి విముక్తికోసం ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన వేలాదిమంది ఎంతో ఉత్సాహాంగా పాల్గొని పరుగులు తీశారు.
5కే, 10కే, 21కే మూడు కేటగిరీల్లో పరుగుపందెం నిర్వహించి విజేతలుగా నిలిచిన పలువురికి సర్టిఫికేట్లు, నగదు ప్రొత్సాహాకాలు అందజేశారు.